SEARCH

Sunday 30 November 2014

గౌతమీ గ్రంధాలయం - వివేకానందుల వారు - ఎన్సైక్లోపీడియా

గోదావరి బ్లాగ్ లో గౌతమీ గ్రంధాలయం గురించి చదివినపుడు నాకున్న అనుబంధం  గుర్తుకు వచ్చింది,
 అందరూ  వార్తా పత్రికలు  చదవడానికి వెళితే, నేను కధల పుస్తకాలు  చదవడానికి వెళ్ళే వాడిని.
పుస్తకాలు ఇంటికి తీసుకుని వెళ్లి చదివే సమయం వచ్చేప్పటికి, రోజుకు  రెండు పుస్తకాలు  చదివేవాడిని.
ఒకరోజు పొద్దునే వెళ్లి రెండు పుస్తకాలు తీసుకుని వెళ్లి, సాయంత్రం వెళ్లి పొద్దున్న చదివిన పుస్తకాలని ఇచ్చి , ఇంకో రెండు పుస్తకాలు తీసుకుందామని అనుకుంటే  లైబ్రరియన్ , బాబు ! రోజుకు రెండు పుస్తకాలే ఇస్తారు, అన్నారు.
చేసేది లేక వేనుతిరిగాం.  ఆ సంగతి మా స్నేహితుడు ఇప్పుడు కూడ  గుర్తు చేస్తూ  భలే  భయపెట్టావు  కదరా ! అంటూ ఉంటాడు.
వాళ్ళు వార్తలు చదివే సమయంలో నేనో నవల చదివేసేవాడిని !

సరే! వివేకానందుల వారు  ఎన్సైక్లోపీడియా  ఆఫ్ బ్రిటానిక ఒక్క రాత్రిలో ఎలా చదివేసారో మీకు తెలుసా !
కొంతమంది అక్షరం, అక్షరం లేదా వాక్యం తరువాత వాక్యం , వరుస తరువాత వరుస ఇంకొంతమంది పేరా నుంచి పేరా .  కాని  ఈయన మాత్రం  పేజీ  నుంచి పేజీ చదివేవారట
అంటే పేజీలో మొదటి వరుస చివరి వరుస చదివి మొత్తం పేజిలో వున్నసంగతి అర్థం చేసుకునేవారన్నమాట
మొదటి సారి ఈ విషయం తెలిసినపుడు అదేం  గొప్ప విషయం నేను అంతే  బాగోని కధలు చదివేప్పుడు అలాగే చదివేస్తా అనుకున్నాను.
కాని ఆయనతో  మనకు పోలికేమిటి !
ధన్యవాదాలు  విశ్వనాదుగారు గౌతమీ   గ్రంధాలయం గురించి నాకు గుర్తు చేసినందుకు.  

Friday 28 November 2014

Doctor ? Doctor !


సింహం - గ్రామ సింహం

నిన్న మాటల మధ్యలో మర్క ట  కిశోర న్యాయం , మార్జాల  కిశోర న్యాయం  గురించి  వచ్చి ఇలా  తెలుగులో  ఇంకా పదాలు ఏమి వున్నాయి అంటే  గ్రామ సింహం  అన్నాను.
మావాడు నన్ను గ్రామ సింహం  అంటే తెలిసే వాడుతున్నావా ? అని అడిగాడు .
అడవిలో  సింహం  గ్రామం లో గ్రామ సింహం అన్నాను. పెద్ద తెలిసినట్లు
అప్పుడు మావాడు ఒక విషయం  చెప్పాడు.
సీమ సింహం,సింహం   ఇలాగ ఒకటే సింహం సినిమాలు ఇప్పుడు వచ్చినట్లే,  ముందు కుడా సింహబలుడు  మొదలగు సింహం సినిమాలు వచ్చినపుడు  ఒక నిర్మాత  నటసేఖరునితో   గ్రామ సింహం  సినిమా తీస్తానంటే
పక్కనే  వున్న రచయితతో గ్రామ సింహం అంటే ఏమిటో అర్ధం అయ్యేలా చెప్పించారట.  ఆ నిర్మాత మళ్లీ  కనపడలేదట.

సరే నాకు  గ్రామ సింహంగురించి  చెప్పు అని  గట్టిగా అంటే
వూర కుక్కరా  నాయనా ! అన్నాడు
ఇంకేం మాట్లాడతాం ?!

Thursday 27 November 2014

One real time moving show


15 వసంతాల పైబడిన వాహనాలు జాగ్రత్త !

కాలుష్య నివారణ చర్యలలో భాగంగా  డిల్లీ  రోడ్లపై ఇక 15 వసంతాల పైబడిన వాహనాలు తిరగకుండా  చూస్తారట
వాయు కాలుష్యం బాగా పెరిగిపోయిన సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  ఈ ఆదేశాలు జారీచేసింది
కాబట్టి  15 వసంతాల పైబడిన వాహనాలు జాగ్రత్త
త్వరలోనే ఇలాంటిదేదో  మనకు వస్తే  చాల బాగుంటుంది కదా !

సరే మీకో విషయం తెలుసా గుడ్డు ముందా పిల్ల ముందా అని ఆడిగితే  ఇంక తెల్ల మొహం వేయక్కర్లేదు
పిల్లే ముందు  ఎందుకంటే శాస్త్రవేత్తలు  కనిపెట్టిన విషయం అది
ఎలా అంటే  గుడ్డు తయ్యారు కావాలంటే కావలసిన విషయాలు కోడి కడుపులోనే ఉన్నాయిట .

Wednesday 26 November 2014

INDIA or BHARAT

BHARAT , HINDUSTAN , JAMBU DWEEP Etc ., are the names of our beloved Country once in past as well.

Do you Know how India is named

INDIA - INDEPENDENT NATION DECLARED IN AUGUST

It is the name given by Britishers  and short form of our country INDIA

So, now tell me after knowing this do we have to fight for change of our nation name as BHARAT or
not


టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్ వర్క్




జర్మన్ శాస్త్రవేత్తలు టీవీ సిగ్నళ్లతో ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ సిగ్నళ్ల ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ స్థాయిలో ఉండే టీవీ ఫ్రీక్వెన్సీ సిగ్నళ్లు గోడల్లాంటి అడ్డంకులను కూడా అధిగమించి దూసుకుపోతాయని, దీంతో మొబైల్ లాంటి వాటికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. 

ఈ పరిశోధనలు ఫలిస్తే ఇంటర్నెట్ వినియోగించేవారి ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు కూడా వైర్ లెస్ ల్యాన్ అందే వెసులుబాటు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తే అందరికీ నెట్ అందుబాటులో ఉంటుందని వారు వివరించారు.

Two sizzling toons !!




The following two pics which I got on whatsup thought to share the same with you all




Tuesday 25 November 2014

పొగ రాయుళ్ళ ను కాపాడతారా !



విడిగా  సిగరెట్ల విక్రయాలను ఆపేస్తారట , పొగ త్రాగే వారి అర్హత వయస్సు పెంచుతారట !
మన ప్రభుత్వానికి  ఇచ్చిన సలహాలను  పాటించి  పొగాకు ఉత్పత్తులను వాడటం  తగ్గిస్తారుట .

 అదికూడా  నిదానంగా  చేస్తారుట

ఆహా ! ఎంత మంచి నిర్ణయం. 

పొగాకు ఉత్పత్తులఫై హెచ్హరికలు  తరువాత

నిషిద్ధ ప్రాంతాలు ,జరిమానాలు

సినిమా ప్రదర్శనకు ముందు భయంకర  ప్రకటనలు , పొగ త్రాగే సన్నివేశాలలో  హెచ్హరికలు

ఇంకా ఎంత సమయం కావాలో ! పూర్తి నిషేధానికి

Monday 24 November 2014

సారీ! చెపితే తప్పా ?!


క్షమాగుణం దైవీలక్షణం అని పెద్దలు అంటారు 

తప్పు చేసి క్షమించమనడం మనకు అలవాటే,  కాని ఒక్కో సారి   సారీ ! అనల్సివస్తుంది 
సారీ! చెపితే నువ్వు తప్పు చేసినట్లు కాదు అలాగని ఎదుటివాడు ఒప్పు కాదు 
క్షమించమని అడిగితె నువ్వు అనుబంధానికి విలువ ఇచినట్టు  
అలాంటప్పుడే మనలోని మనీషి   బయటకు వచ్చి  ఇంకా మనం చేయవలసినవి వున్నాయి  అని గుర్తు  చేస్తుంటాడు  అక్కడే ఆగిపోక  సాగాలి ముందుకు . 

ఎదుటి వ్యక్తీ   నిన్ను వదులుకోడు !
మంచిని  వదిలిపెడితే  జీవితం అదుపు తప్పుతుంది కదా !?

Friday 21 November 2014

మూడో భాషగా సంస్కృతం !?

కేంద్రీయ విద్యాలయాల నుంచి మూడో భాషగా కొనసాగుతున్న జర్మనీని తొలగించే విషయంలో విజయం సాధించిన ఆరెస్సెస్ అనుబంధ విభాగం సంస్కృత భారతి, తాజాగా కేంద్రం ముందు మరో ప్రతిపాదనను పెట్టింది. దేశంలోని సీబీఎస్ఈ సిలబస్ తో కొనసాగుతున్న అన్ని విద్యాలయాల్లో ఇకపై సంస్కృతాన్ని మూడో భాషగా తప్పనిసరి చేయాలని ఆ సంస్థ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కోరింది.

Monday 17 November 2014

కుటుంబ సభ్యులు శ్రద్ధ - పెంపకం ఎదుగుదలలో ఉదాహరణలు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రతిభ ఉన్నా పరిస్థితుల కారణంగా మసకబారిన వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. కష్టాన్నే నమ్ముకుని సచిన్ అంచెలంచెలుగా పైకెదిగాడు. రికార్డుల రారాజు అయ్యాడు. కానీ, కాంబ్లీ ఒక్కసారిగా వచ్చిపడ్డ పేరుప్రతిష్ఠలతో దారి తప్పాడు. ఫలితం, కెరీర్ పతనం దిశగా సాగింది. ఇటీవలే ఓ ఆంగ్ల దినపత్రిక సచిన్ ను కాంబ్లీ గురించి వ్యాఖ్యానించమని కోరింది. దీనికి మాస్టర్ బదులిస్తూ, పరస్పరం విభిన్నమైన వ్యక్తులమని పేర్కొన్నాడు. వివిధ రకాల పరిస్థితుల పట్ల వేర్వేరు రీతుల్లో తాము స్పందిస్తామన్నాడు. అయితే, ప్రతిభ గురించి మాట్లాడబోనని, అది తనకు సంబంధించిన విషయం కాదని అన్నాడు. ముఖ్యంగా, కుటుంబ సభ్యులు తనపై ఎప్పుడూ శ్రద్ధ వహించేవారని, తాను నేల విడిచి సాము చేయకుండా వారే నియంత్రించేవారని సచిన్ చెప్పుకొచ్చాడు. పెంపకం తన ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషించిందన్న కోణంలో అభిప్రాయాలు వెలిబుచ్చాడు సచిన్. అయితే, ఈ విషయంలో కాంబ్లీ గురించి మాట్లాడలేనని తెలిపాడు.

విజయవాడలో రాత్రినగర సంచారం - గుర్తింపు కార్డులు ఉంటేనే!?

విజయవాడ నగరంలో ఇకపై రాత్రి సంచరించాలంటే గుర్తింపు కార్డులుండాల్సిందే. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట బెజవాడ పోలీసులు ఆదివారం రాత్రి ప్రారంభించిన సరికొత్త భద్రతా చర్యలు నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదివారం రాత్రి దాదాపు 200 మందికి పైగా నగరవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల అదుపులోని వారిలో దినసరి కూలీలే అధికంగా ఉన్నారని సమాచారం.

కేవలం గుర్తింపు కార్డులు లేని కారణంగానే వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే దినసరి కూలీలుగా కాలం వెళ్లదీస్తున్న తాము గుర్తింపు కార్డులను ఎలా వెంటబెట్టుకుని వెళతామంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తాజా ఆపరేషన్ నేపథ్యంలో రాత్రి 11 గంటలు దాటితే బయటకు వచ్చేందుకు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే నగరంలో నేరాలను కట్టడి చేసేందుకే నైట్ డామినేషన్ ఆపరేషన్ కు తెర తీసినట్లు నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సెలవలు వాడుకుంటున్నారా ? పని చేస్తున్నారా ?

సెలవులొస్తే ఏం చేస్తాం? సరదాగా కుటుంబంతో గడపడమో, లేకపోతే దూరాన ఉన్న తల్లిదండ్రులను పలకరించడమో చేస్తాం. అయితే ఇటీవల కాలంలో సెలవులను హైదరాబాదీలు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు, బంధుమిత్రులను కలిసేందుకే వినియోగిస్తున్నారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ఎక్స్ పెడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

పెళ్లిళ్లకు వెళ్లేందుకు హైదరాబాదీలు పక్కా ప్రణాళికలు రచించుకుంటారని కూడా ఈ సర్వే తేల్చింది. ఇక సెలవులను వాడుకోని వారు హైదరాబాద్ లో 52 శాతం ఉన్నారు. సెలవుల కన్నా, వేతనం పెరిగితే బాగుంటుందని 67 శాతం మంది హైదరాబాదీలు భావిస్తున్నారు. ముంబై వాసులు మాత్రం సెలవులను వాడుకునేందుకు బదులు పనిచేసేందుకే ప్రాధాన్యమిస్తారని తేలింది. బెంగళూరు వాసులు కూడా ముంబైకర్ల బాటలోనే నడుస్తున్నారు. వీరికి భిన్నంగా సెలవులను సరదాగా గడిపేందుకే ఢిల్లీ వాసులు ప్రాధాన్యమిస్తున్నారు.


Saturday 15 November 2014

రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ !

ఉమ్మడి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూంలో రంగారెడ్డి జిల్లాదే అగ్రస్థానం. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచే ఉమ్మడి రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆదాయంలో సగాన సగం వచ్చేది. అయితే రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో రియల్ బూం పడకేసింది. సగం కాదు కదా నాలుగో వంతు ఆదాయం కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నది అదికారులు వాదన. ఇప్పటికే దాదాపు 50 శాతం మేర (49.55) ఆదాయం పడిపోయింది. తొలి ఆరు నెలల్లోనే ఈ మేర ఆదాయం పడిపోవడంపై అటు అధికార వర్గాలతో పాటుే తెలంగాణ సర్కారు కూడా ఆందోళనలో కూరుకుపోయింది.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి రూ.2,361.69 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం తొలి ఆరు నెలల్లో రూ.1,346.16 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.690.84 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఈ ఆదాయం సర్కారు లక్ష్యంలో 51.75 శాతం మాత్రమే. ఈ తగ్గుదల విభజన ప్రభావం వల్లే నమోదైందన్న వాదన వినిపిస్తుండగా, త్వరలో రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ పుంజుకోవడం ఖాయమని కొందరు ఆశావహులు వాదిస్తున్నారు.

Friday 14 November 2014

అంబాసిడర్,మారుతి 800 తరవాత హ్యుందాయ్

1990 దశకంలో భారత్ లోకి ప్రవేశించిన శాంత్రో కార్లు మారుతి 800కి ప్రధాన పోటీగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఈ మోడల్ కార్లకు వీడ్కోలు పలకాలని హ్యుందాయ్ నిర్ణయించింది.
కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కి ఇండియాలో ఘనమైన గుర్తింపును తెచ్చిన శాంత్రో కార్లు మార్కెట్ నుంచి కనుమరుగు కానున్నాయి. 
 ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇప్పటికే 13.6 లక్షల యూనిట్లను ఇండియాలో, 5.3 లక్షల యూనిట్లను విదేశాల్లో విక్రయించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం నెలకు కేవలం 3 వేల శాంత్రో యూనిట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. నిల్వ ఉన్న శాంత్రో స్టాక్స్ అయిపోయే వరకు అమ్మకాలు సాగిస్తామని తెలిపారు. కాగా మారుతి సుజుకి సంస్థ సైతం తమ బ్రాండ్ 'మారుతి 800'కు వీడ్కోలు పలుకగా,
ఆల్టో ని ప్రారంభ శ్రేణి వాహనంగా  చేసింది . 
హిందూస్తాన్ మోటార్స్ 'అంబాసిడర్' తయారీని ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే.  



Tuesday 4 November 2014

రికార్డ్ బద్దలు కొట్టిన సెన్సెక్స్

ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 28 వేల మార్క్ ను టచ్ చేసింది. ఇండియన్ ఎకానమీ బలపడుతోందన్న అంచనాలతో మార్కెట్లలోకి నిధుల ప్రవాహం భారీగా ఉండటంలో సెన్సెక్స్, నిఫ్టీలు ఉరకలేస్తున్నాయి. మార్కెట్లు ప్రారంభమైన కాసేపటికే సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 28,006 పాయింట్లకు పెరిగింది. నిఫ్టీ 8,363కి చేరుకుంది

ఇంతకీ దీనివల్ల ఎవరికి లాభం !?

Monday 3 November 2014

శిరోజాల సంరక్షణ - హెన్నా (గోరింటాకు)


శిరోజాల సంరక్షణకు ప్రాముఖ్యతనిచ్చేవారికి హెన్నా (గోరింటాకు) గురించి పరిచయం చేయనక్కర్లేదు. తెల్లవెంట్రుకలున్న వారు దీనిని అత్యధికంగా వినియోగిస్తారు. ఇది కురులను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు, కుదుళ్ల నుంచి బలంగా ఉండేట్టు చేస్తుంది. అంతేగాదు, జుట్టుకు మెరుపునిస్తుంది. మరి దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. నెలలో రోజుకు రెండుసార్లు తలకు ప్యాక్ వేయాలి. తద్వారా, దెబ్బతిన్న కురులు మరలా ఆరోగ్యకరంగా తయారవుతాయి. ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను రంగరించి మాడుకు పట్టిస్తే మంచి ఫలితాలు వస్తాయి. హెన్నా మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం ద్వారా జుట్టు చిక్కబడుతుంది. శిరోజాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది హెన్నా. 
తెల్ల వెంట్రుకలు నిరోధానికి :ఇక, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని బాధపడేవారికి ఇది మంచి నేస్తం. నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేసి బాగా కలియదిప్పాలి. అప్పుడు హెన్నా కలిపి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు కానీ, లేక, రాత్రంతా కానీ దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. దీన్ని పూయడం ద్వారా తెల్లవెంట్రుకలు కాసింత రంగు పులుముకుంటాయి.
చుండ్రు నిరోధానికి :
అన్నిటికంటే ముఖ్యంగా, హెన్నా చుండ్రుతో సమర్థంగా పోరాడుతుంది. రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బాలి. ఆవాల నూనెను మరిగించి గోరింట ఆకులను దాంట్లో వేయాలి. చల్లారిన తర్వాత మెంతుల చూర్ణాన్ని దానికి కలిపి మాడుకు పట్టించాలి. ఈ మిశ్రమం చుండ్రుపై బాగా పనిచేస్తుంది.