SEARCH

Sunday 16 August 2015

ఉగాది 15వ సంచిక

ఉగాది 15వ  సంచిక 
ఈ  సంచికలో  
1. భారతీయులు !
2. కలాం కలకాలం మీకు సలాం    
3. తెలుగు  పద్యం
4. మనమేనా
5. మహాత్మా నీకు వందనం

6. ఇల్లు కట్టి చూడు !!    

Saturday 8 August 2015

మృత్యు స్వరూపం


మృత్యు స్వరూపం ఏమిటి? ఆయుష్షు తగ్గడానికి, రోగాలు పెరగడానికి కారణం ఏమిటి?
మృత్యువు స్వరూపం ఇతమిద్దంగా ఇది అని చెప్పడానికి లేదు. కాని కొన్ని విశేషాలు తెలుపుతాను.
కలికాలంలో మానవుడి ఆయుష్షు 128 సంవత్సరాలు. కాని ఎవ్వరూ అన్ని సంవత్సరాలు బ్రతకరు. ఎందువలన?
నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం., వేసవిలో దాహం తీర్చడానికి పెట్టిన చలివేంద్రాలకి పెట్టిన వారి తాతల పేరు నుండి భార్య పేరుతొ సహా చెప్పుకోవడం, ఆలయాలలో ఇచ్చిన గోడగడియారానికి కూడా వంశం లో ఉన్న అందరి పేర్లు పెట్టి ఇది ఫలానా వారు ఇచ్చారని చెప్పుకోవడం ఇలాంటి గోప్పలవలన ఆయుష్షు తగ్గుతుంది.
అత్తమామలని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం, లేదా భర్తతో అత్తమామలపై లేనిపోని చాడీలు చెప్పి తిట్టించడం, గెంటించడం, భర్తని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కయ్యానికి కాలు దువ్వడం, లేనిపోని అనుమానాలతో భర్త లేక భార్య ని హింసపెట్టడం, సంప్రదాయాలని వదిలేయడం.
(అత్తమామలు ఇంట్లో లేకపోతె ఇదే కదా జరిగేది, చెప్పేవారు ఉండరు, తినడం, టివిల ముందు తిష్ట వేసుకుని కూర్చోవడం, వంట చేయడం కూడా మనసు పెట్టె పనిలేదు. వంట చేశాం అంటే చేశాం. ఒక పూజ ఉండదు, గుడికి వెళ్ళడం ఉండదు, చుట్టుపక్కల విషయాలన్నీ చెవిలో వేసుకోవడం. సినిమాలు, షికార్లు అని తిరగం, పిల్లల సంగతి సరేసరి! వీళ్ళని తాయారు చేయడానికి కూడా 100 తిట్టుకుంటూ తయారుచేస్తారు కొందరు తల్లులు. ఎందుకు బ్రతుకుతున్నారో కూడా పాపం పసివాళ్ళకి కూడా తెలియదు.) మొదటి రాత్రి భర్తకి ఈ కలికాలంలో పరీక్ష. విజయం సాధించడా మంచివాడు అవుతాడు. పొరపాటున ఓడిపోయడా వీడి జీవితం నాశనం. గుప్పెట్లో పెట్టి నోక్కేస్తుంది. కొందఱు మహిళా మణులైతే వీడి మీద లేనిపోని చాడీలు చెప్పి ఇంకో వివాహానికి సిద్ధపడతారు.
సంప్రదాయాలు చెప్పెపనిలేదు. వినే అవసరం అంతకంటే లేదు. చెయ్యాలంటే బద్ధకం, చెయ్యాలని ఒకానొకరోజు పూనుకుంటారు. 2రోజులు బాగానే చేస్తారు. 3 రోజు విసుగు వస్తుంది, వారం తిరిగేసరికి మంగళం పడేస్తారు.
ఉదయం 7,8,9 గంటలకి నిద్ర లేవడం, త్రిసంధ్యాకాలాలో నిద్రించడం, తినడం తిరగడం, ఇష్టమైన పని చేయడం తప్పితే సంప్రదాయాలు పట్టించుకోరు. ఉచిత సలహాలు అడగకపోయినా ఇస్తారు. ఇలాంటి కారణముల వలన ఆయుష్షు తగ్గుతుంది.
పాపుల్ని అదేపనిగా తిట్టడం వలన వాడి ఆయుష్షు పెరిగి తిట్టినవారి ఆయుర్దాయం తగ్గుతుంది. అందుకే అన్నారు పాపి చిరాయువు అని.
అనవసరపు అనుమానాలు పెంచుకోవడం వలన, అతిగా ఆవేశపడటం వలన, కోపగించుకోవడం, అరవడం,తిట్టడం, వీటి వలన ఆయుష్షు తగ్గుతుంది.
ప్రమాదంలో మరణించేవారు, ప్రమాదవశాత్తు మరణించేవారు అత్యంత పాపాత్ములు. పుట్టిన వెంటనే మరణించేవారు, చిన్న వయస్సులో మరణించేవారు, తల్లిదండ్రులని భాదించేవారు, గురువులని బ్రాహ్మణులని దూషించేవారు, బ్రాహ్మణ జాతిలో జన్మించి వేదాలు వదిలి ఇష్టం వచ్చినట్టు తిరిగేవారు పరమ పాపాత్ములు. దానం చేయని వారు, చేసేవారిని ఆపేవారు, పురాణములు చెప్పెచోట నిద్రించేవారు, పక్కవారితో పరచాకలు ఆడేవారు, అప్పు ఇచ్చి జలగలా పీడించేవారు, తీసుకున్న అప్పుని ఏదో నెపంతో ఎగ్గోట్టేవారు, ఆహార నియమం పాటించనివారు, బంగారం దొంగతనం చేసేవారు, ఈ కాలంలో ఇవి సాధ్యం కదండీ అని చెప్పేవారు, వీరందరూ రాక్షస అంశాలో జన్మించినవారు. వీరికి ఆయుర్దాయం తక్కువ. బ్రతికినన్నాళ్లు ఏదో ఒక సమస్యతో (ఇంటి రోగమో, వంటి రోగమో, మనస్సులో తీరని ఆవేదనో) బాధపడుతూనే ఉంటారు. చనిపోయిన తరువాత ఘోరమైన రౌరవాది నరకాలలో పడతారు.
ఇంకా ఉన్నాయి కానీ ఎన్నని చెప్తాం. ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాల్సిందే. కాకపోతే ప్రస్తుతానికి కొన్ని మాత్రం ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్పాను. ఇందులో నాపైత్యం ఏమి లేదండి. ఉన్న విషయం చెప్పాను.
ఇప్పటివరకు వీటిలో మీలో ఎవరైనా పైన చెప్పిన పనులు చేస్తే వెంటనే ఆపేయండి, లేదా 1 కి 1000 రెట్లు బాధపడతారు


గురువుగారికి  కృతజ్ఞతలతో