SEARCH

Saturday 27 December 2014

ఇలాగ భోజనము చేయండి !



ఆకులమీద, ఇనుపపీటల మీద కూర్చొని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకులో మాత్రమె భోజనం చేయాలి. భోజనానికి ముందూ తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసేముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. 

ఎన్ని సార్లు భోజనము  చేయాలి ?
ప్రతిరోజూ రెండుసార్లు భోజనము చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది.


భోజనము ఏవైపు తిరిగి చేయాలి?
 భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అలాగే దక్షిణదిశగా తిరిగి భోజనము చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనము చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాలలో ఉంది. కనుక తూర్పువైపు తిరిగి భోజనం చేయటం అనేది చాలా ఉత్తమమైన పధ్ధతి.

గురువుగారికి నమస్కారములుతో 

No comments:

Post a Comment