SEARCH

Monday 25 January 2016

ర్యాలి – శ్రీ జగన్మోహిని కేశవస్వామి

మీకు జరూరుగా ఉద్యోగంలో  స్థానం మార్పు అంటే ట్రాన్సఫర్ కావాలా అయితే వెళ్ళిరండి ర్యాలి. 
      ర్యాలి అనేది ఆంధ్రప్రదేశ్లోని  తూర్పు గోదావరి జిల్లా  రావులపాలెం దగ్గరలోని  ఒక గ్రామం
      ఇక్కడే వున్న ఒక భగవత్ రూపం గురించి విశేషాలు అందిచడమే ఈ శీర్షిక ఉద్దేశ్యం
   
క్షీరసాగర మధనంలో శ్రీహరి ధరించిన రూపాలు రెండు.  మొదటిది ఆరంభంలో కూర్మావతారము అయితే రెండోది అమృతం లభించిన వేళ పంచేందుకు వచ్చిన జగన్మోహిని అవతారం
ఇంకో విశేషం ఏమిటి అంటే అర్ధనారీశ్వర రూపం ఆది దంపతులకు ఏకాత్మ స్వరూపం అయితే,
జగన్మోహిని కేశవ స్వామి వారిది ఒకే భగవత్స్వరూపానికి ఉన్న రెండు రూపాలు అన్నమాట
 అందువలన ఈయన అలాగే దర్శనం ఇస్తారు, అంతేకాదు విష్ణు పాదోద్భవ గంగ అని కదా  మనం విన్నాం ఇక్కడ ఆ విశేషం కళ్ళారా చూడవచ్చు, కేశవస్వామి పాదాలనుంచి నిత్యం ఊరుతూ ఉబికి వస్తూ వుంటుంది గంగ . మనం దర్శించే సమయంలో ఆ గంగా జలం  మనపై ప్రోక్షిస్తారు.
ఐదు అడుగుల ఏక సాలగ్రామ  శిలా మూర్తి జగన్మోహిని కేశవ స్వామి వారిది

     ర్యాలి లో మనం దర్శించే రూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది. అంటే అర్ధనారీశ్వరుని రూపంలాంటిది.
     కానీ శివుడు, పార్వతీదేవి కలసి ఉన్న రూపం అర్ధనారీశ్వరునిది అయితే ముందు పురుషరూపం వెనుక స్త్రీ రూపం కలగలసిన స్వరూపం జగన్మోహిని కేశవ స్వామి వారిది

ముందు ఉన్న పురుష రూపం కేశవ స్వామి వారు, విష్ణు అలంకార ప్రియుడు కదా  
    ఇక ఇక్కడ గర్భాలయంలోనికి వెళ్ళవచ్చు. అందువలననే వెనుక ఉన్న మోహినీ రూపాన్ని మనం దర్శించగలం.
     వెనుక స్త్రీ  రూపం కొప్పు ముడిచి పువ్వులు ఉన్న రూపం, పద్మినీజాతి స్త్రీలకు ఉండే పుట్టుమచ్చ, చీర వెనుకవైపు భాగం మనకు స్పష్టంగా కనపడుతుంది.

No comments:

Post a Comment