SEARCH

Wednesday 27 August 2014

ఏపీరాజధానిగా వినుకొండ-మార్టూరు ?

కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్‌ కమిటీ సమర్పించబోతోన్న నివేదికలోని కీలక అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శివరామకృష్ణన్‌ కమిటీ ఏపీరాజధానిగా వినుకొండ-మార్టూరు ను 'బెస్ట్ ఛాయిస్ గా' పేర్కొంది. విజయవాడ-గుంటూరును రాజధానిని చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని కమిటీ సూచించింది.ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే ఆర్థిక పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని కమిటీ హెచ్చరించింది

వినుకొండ గుంటూరు జిల్లాలో ఉండగా... మార్టూరు ప్రకాశం జిల్లాలో ఉంది. వినుకొండ-మార్టారు మధ్య ప్రాంతం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి అత్యంత అనుకూలమని కమిటీ తేల్చింది. మార్టూరు... వినుకొండ కు మధ్య సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే జిల్లా రాజధాని గుంటూరు నుంచి వినుకొండ సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. వినుకొండకు మార్టారుకు మధ్య ఉన్న ముఖ్యనగరం నరసరావు పేట. నరసరావు రావు పేటకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వినుకొండ ఉంది. నరసరావు పేట నుంచి మార్టూరు కు మధ్య దూరం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది.

1 comment:

  1. ఏంటీ మావినుకొండ రాజధాని అవుతుందా?

    రాజధానవటమేమోగానీ దొనకొండలాగా స్థలాలు కొని జనం ఆరిపోకుండా చూడండి

    ReplyDelete