SEARCH

Saturday 15 November 2014

రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ !

ఉమ్మడి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూంలో రంగారెడ్డి జిల్లాదే అగ్రస్థానం. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లా నుంచే ఉమ్మడి రాష్ట్ర రిజిస్ట్రేషన్ ఆదాయంలో సగాన సగం వచ్చేది. అయితే రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో రియల్ బూం పడకేసింది. సగం కాదు కదా నాలుగో వంతు ఆదాయం కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నది అదికారులు వాదన. ఇప్పటికే దాదాపు 50 శాతం మేర (49.55) ఆదాయం పడిపోయింది. తొలి ఆరు నెలల్లోనే ఈ మేర ఆదాయం పడిపోవడంపై అటు అధికార వర్గాలతో పాటుే తెలంగాణ సర్కారు కూడా ఆందోళనలో కూరుకుపోయింది.

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి రూ.2,361.69 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం తొలి ఆరు నెలల్లో రూ.1,346.16 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.690.84 కోట్లు మాత్రమే ఖజానాకు చేరింది. ఈ ఆదాయం సర్కారు లక్ష్యంలో 51.75 శాతం మాత్రమే. ఈ తగ్గుదల విభజన ప్రభావం వల్లే నమోదైందన్న వాదన వినిపిస్తుండగా, త్వరలో రంగారెడ్డి జిల్లా రియల్ బూం మళ్లీ పుంజుకోవడం ఖాయమని కొందరు ఆశావహులు వాదిస్తున్నారు.

1 comment:

  1. వాడెవేడో రియల్ ఎస్టేట్ మటాష్ అయిపోయి తెలంగాణా చస్తదన్నడు వాన్నోట్ల మన్ను బడ!

    ReplyDelete