SEARCH

Tuesday 21 October 2014

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణుల సలహాలు - దీపావళి బొనాంజా

మదుపరులకు ఆర్థిక రంగ నిపుణులు దీపావళి బొనాంజా సలహాలు జారీ చేశారు. దేశ వ్యాపార రంగంలో శరవేగంగా వృద్ధి సాధించడమే కాక స్థిరంగా రాబడులను అందిస్తున్న పది కంపెనీల షేర్లను ఈ దీపావళికి కొనుగోలు చేస్తే, వచ్చే దీపావళి నాటికి వాటి ధర దాదాపు 98 శాతం దాకా పెరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ షేర్ల పేర్లు చెప్పండి అంటారా?... ఈ జాబితాలో తొలి స్థానంలో డీసీబీ ఉండగా, రెండో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.

ఆసియానా హౌసింగ్, కేపిటల్ ఫస్ట్, మేఘమణి ఆర్గానిక్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత సట్లెజ్ టెక్స్ టైల్స్, అపోలో టైర్స్, మంగళం సిమెంట్స్, సియారామ్ సిల్క్ మిల్స్, ఇండియా సిమెంట్స్ ఉన్నాయి. వీటిలో మేఘమణి ఆర్గానిక్స్ అత్యధికంగా 98 శాతం లాభాలను అందిస్తుందట.

*సూచనగానే గమనించ ప్రార్ధన 
*Investments are subject to  market risk, the above info be used at your own discretion.

No comments:

Post a Comment