SEARCH

Monday 27 October 2014

అబ్బా! మళ్లీ ఆధార్


ఆధార్ సంఖ్యకు మొబైల్ సిమ్ ను కేంద్రం అనుసంధానించబోతున్నట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, "యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కు మొబైల్ సిమ్ ను అనుసంధానించమని ప్రధానమంత్రి మాకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం దానిపైనే పని చేస్తున్నాము. కచ్చితంగా మేమీ సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఉంది" అని సదరు సీనియర్ అధికారి వివరించారు. 

ఇలా చేయడం వలన లావాదేవీల సమాచారమంతా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అదే గనుక జరిగితే భారతదేశ ప్రజల సాధికారత సాధనకు ఇది ఓ పరికరంగా ఉంటుందని ఢిల్లీలో జరిగిన ఎఫ్ఐసీసీఐ కార్యక్రమం అనంతరం మీడియాకు ఆ అధికారి వెల్లడించారు.

No comments:

Post a Comment