SEARCH

Tuesday 28 October 2014

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువ

మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువని ఈస్ట్ యాంగ్లియా విశ్వవిద్యాలయం తెలిపింది. మహిళల్లో క్యాన్సర్ కారకాలపై పరిశోధన చేసిన ఆ యూనివర్సిటీ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ పరిశోధనల కోసం 25-55 ఏళ్ల మధ్య ఉన్న 1,71,940 మంది మహిళలను పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల నుంచి రోజూ రెండు కప్పుల టీ తాగుతున్న వారిపై ఈ పరిశోధన నిర్వహించారు. రెండు కప్పుల టీతో పాటు, తాజా పళ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని నిర్థారించారు.

No comments:

Post a Comment