SEARCH

Wednesday 15 October 2014

ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట

మిలమిల మెరిసే చర్మ సౌందర్యాన్ని కోరుకోని వారెవరుంటారు? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ రోజుల్లో తాజాగా కనిపించాలని భావిస్తున్నారు. అలా కనిపించాలంటే చర్మానికి తగిన పోషణ అందించాలి. 
ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట. ఈ విషయంలో క్యారట్, ఆపిల్, ఆరెంజ్, టమేటా, బొప్పాయి జ్యూసులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

*క్యారట్లలో ఉండే విటమిన్ ఏ మొటిమలు, మచ్చలు, మంగు తదితర చర్మ రుగ్మతలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పరిపుష్ఠమైన ఆపిల్ పండ్లు తీసుకుంటే చర్మం ముడతలు పడదు. చర్మ కణజాలం దెబ్బతినదు. 

* ఆరెంజ్ తో చర్మం కొత్త సౌందర్యంతో మెరిసిపోతుందట. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైము చర్మవ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతుంది. 
*అలోవీరా జ్యూస్ కూడా చర్మానికి మేలు చేసేదే.రుచిగా లేకపోయినా  అందులో ఉండే ఖనిజలవణాలు, విటమిన్లు చర్మం యొక్క సాగే గుణాన్ని సరైన స్థితిలో ఉంచుతాయి. 
*టమేటా జ్యూస్ లో ఉండే లైకోపేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మం రంగును మెరుగుపర్చడమే కాకుండా, ముడతలను కూడా మాయం చేస్తుంది.
*బొప్పాయి గురించి అందరికి తెలిసిందే !

1 comment:

  1. నోటిలో పండ్లున్నవాళ్ళు హాయిగా పళ్ళను తినవచ్చును కద. ప్రత్యేకంగా పండ్లరసాల అవసరం లేదు వారికి.

    ReplyDelete