SEARCH

Friday 12 September 2014

ఇవన్నీ పాటించడం ద్వారా మన కిడ్నీలను కాపాడుకోవచ్చు

ఇవన్నీ పాటించడం ద్వారా మన కిడ్నీలను కాపాడుకోవచ్చు. 
తద్వారా, మన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.
 
కిడ్నీల పనితీరు మానవ దేహాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. 

అవి దెబ్బతింటే ఆరోగ్యం క్రమేణా క్షీణించి మనిషి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది.
అంతటి కీలక అవయవాలను పరిరక్షించుకునేందుకు ఈ సూత్రాలు పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు.

* రోజూ వ్యాయామం చేయాలి. దాంతో, రక్తప్రసరణ సాఫీగా జరగుతుంది.
* ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

    ట్యూనా, బ్రిమ్ వంటి చేపలను కూడా తీసుకోవాలి. 
    మాంసాహారాన్ని పరిమితంగానే స్వీకరించాలి.
* మీకు మధుమేహం ఉంటే, బ్లడ్ షుగర్ లెవల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.
* బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ను పరిశీలించాలి.
* మీ కుటుంబంలోగానీ, వంశంలోగానీ ఎవరికైనా కిడ్నీ జబ్బులున్నాయేమో తెలుసుకోవాలి. 

    ఉంటే, వైద్యుల సలహా పాటించాలి.
* వయసుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువుంటే, తగ్గించుకోవాలి. * ఉప్పును పరిమిత మోతాదులోనే వాడాలి.
* మద్యపానం, ధూమపానం వంటి అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాలి. 

   ధూమపానం అలవాటు ఉంటే వెంటనే విడనాడాలి.

No comments:

Post a Comment