SEARCH

Monday 29 September 2014

ఎందుకంటే మళ్లి ఒక కోటి రూపాయలకు రెక్కలు వస్తున్నాయి.



దక్షిణ కొరియాలో ఇంచియాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు ఆరో పసిడి పతకం లభించింది. టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా, సాకేత్ మైనేని జోడీ 6-4, 6-3తో చైనీస్ తైపీ జంట యిన్ పెంగ్, చాన్ పై నెగ్గింది. సానియా, సాకేత్ ధాటికి ప్రత్యర్థులు ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. దీంతో, భారత జోడీ వరుస సెట్లలో అలవోకగా విజయం సాధించింది. 

ఆసియా క్రీడల్లో భారత్ కు ఆరో పసిడి పతకం లభించింది.  ఎవరికైనా ఇది  సంతోషించే విషయమే కాని మనకు కాదు. ఎందుకంటే మళ్లి ఒక కోటి రూపాయలకు రెక్కలు వస్తున్నాయి. 
కచారాన! మజాకా ! అనవసరంగా  డబ్బులు ఖర్చు పెట్టడంలో  ఎవరు మనకు సరి జోడి !

1 comment:

  1. ఉత్తి పుణ్యానికి ప్రమాణ స్వీకారానికి 30 కోట్లు ఖర్చు పెట్టటం కంటే పతకం గెల్చిన వారికి బహుమానం ఇవ్వటం మంచిదే కదా..... సానియా మీర్జా కి మళ్ళీ కోటి రూపాయలు ఇస్తానని మీ ఒక్కరి కే చెవిలో చెప్పారా..... గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్ అయిన అమితాబ్ బచ్చన్ కు 10 కోట్ల కంటే ఎక్కువే ముట్ట చెప్పారు అని ఒక వినికిడి..... అయినా పక్క రాస్థ్త్రము వాళ్ళ మీద పడి ఏడవటం కంటే ఇంకో పని వుండదేమో సీమాంధ్రులకి.....

    ReplyDelete